Saturday, November 29, 2008

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జన్నాన్ని - ఇది నిజంగా మన విజయమా?

తీవ్రవాదులతో పోరాటం ముగిసింది. ఇక పోరాడాల్సింది మన కుళ్ళు రాజకీయ నాయకులతో....ఇంత మారణ హోమంలోనూ ప్రచారానికి వెంపర్లాడే మన రాజకీయ నాయకులు ఆ ఉగ్రవాదులకంటే ప్రమాదం. పరామర్శకు వచ్చే కుహనా నాయకమన్యులను జనం నిలదీసి చెప్పుతో కొట్టే రోజు రావాలి.

కాని అది జరగదు. ఎందుకంటే మన సీతారాములవారన్నట్లు ఈ జనానికి సిగ్గు లేదు. మారణ హోమాన్ని నియంత్రించటానికి ప్రతిగా మరో విధ్వంసకాండను సృష్టించి సహచరుల్ని కోల్పోయిన నిర్వికార పరిస్తితుల్లో బయటకు వస్తున్న సైనికులతో కరచాలనానికి ప్రయత్నిస్తూ జై భారత్ అనటంతోనే వారు దేశ రుణం తీర్చేసుకున్నారు.

"బులెట్ ప్రూఫ్ జాకెట్లు వున్నా మన పోలీసులు, కమేండోలు ఎందుకు చనిపోయారు అని ఒక్కరైనా అడగరేం..అసలు పట్టుమని పది మందైనా లేని టెర్రరిస్టులని ఎదురుకోవడానికి నాలుగొందలు పైబడిన పోలీసులు, కమేండోలకి అరవై గంటలు ఎందుకు పట్టిందని ఎవరూ అడగరేం..? ఉన్నికృష్ణన్ శవం చూపిస్తూ - "మంజునాథన్.. ఉన్నికృష్ణన్ శవం చూడటానికి ఎవరెవరు వచ్చారు.. సినిమా స్టార్లు ఎవరైనా వచ్చారా..?" అని అడిగే టీవీ యాంకర్లకి ఈ ప్రశ్నలు గుర్తుకు రావా..?" - అంటూ ప్రశ్నలు సంధించిన ఒక బ్లాగరి ఎంతటి నిష్టూర సత్యాలను ఉదహరిస్తున్నాడో గమనించండి. నిజంగానే ఈ ప్రశ్నలు ఎవరికీ తట్టావా? ఈ ఘటనను మన విజయంగా చిత్రీకరించటానికి ఎవరికైనా ఎలా మనసొప్పుతోందో నాకర్థం కావటం లేదు. ఇటువంటి అల్ప విజయాలను సంబరంగా జరుపుకొని జబ్బలు చరుచుకుంటే ఈ ముష్కరుల ఆగడాలు ఎన్నటికీ ఆగవు.

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జన్నాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరాని ఎవ్వరేమైపోనీ ని

గాలివాటు గమనానికి కాలిబాటదేనికీ
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికీ ?
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాటం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావకాష్టం
కృష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం ని

పాతరాతి గుహలు పాల రాతి గుహలైనా
అడివి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ ని

No comments: